* ఆస్పత్రి సౌకర్యాలు సరిగా లేవు * సూపర్ స్పెషాలిటీ వార్డుకు మార్చండి అంటూ అధికారులను కోరిన లాలు రాంచీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్నఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం కారణంగా బెయిల్మీద విడుదలయ్యారు. ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన లాలూ గతనెల 25న డిశ్ఛార్జ్ అయ్యారు. ఛాతిలో నొప్పి, హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోవడంతో అనారోగ్యం పాలైన ఆయన అక్కడ చికిత్స తీసుకున్న అనంతరం రాంచీలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే తనకు కేటాయించిన వార్డులో సదుపాయాలు సరిగా లేవని ఆయన జైలు అధికారులకు, ఆసుపత్రి యాజమాన్యానికి లేఖ రాశారు. వీధికుక్కలు అరుస్తుండటంతో తనకు నిద్ర పట్టడం లేదని తన వార్డును మార్చాలనికోరినట్లు రిమ్స్(రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) డైరెక్టర్ ఆర్కే శ్రీవాస్తవ తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు లేఖ రాసినట్లు వారు ఈ సందర్బంగా తెలిపారు.