ముందస్తు ఎన్నికలు దగ్గర పడుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్న ఈ తరుణంలో తెలంగాణా రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో ఓటర్ల జాబితా ముసాయిదాను శనివారం విడుదల చేసింది. దానిపై ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అక్టోబర్ 31లోగా తెలియజేయాలని కోరింది. అభ్యంతరాలను నవంబర్ 30లోగా పరిశీలించి అవసరమైతే సవరణలు చేస్తామని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఈ కార్యక్రమం పూర్తయిపోతే బిజెపి పాలిత రాష్ట్రాలతోపాటు తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించవచ్చు.