బస్సు సర్వీసులు రద్దు

SMTV Desk 2018-09-01 11:17:11  Bus services , Pragathi Nivedana Sabha

మధిర డిపోకు చెందిన మొత్తం 65 ఆర్టీసీ బస్సులను టిఆర్‌ఎస్‌ ప్రగతి నివేధన సభకు కేటాయంచడంతో రేపు ఆదివారం డిపో పరిధిలోని ఆర్డీసీ బస్సు సర్వీసులు మొత్తం రద్దు చేసినట్లు డిపో మేనేజర్‌ నారాయణ చెప్పారు. దీంతో ఆదివారం మధిర నుండి ఒక్క బస్సు కూడా నడవదని ప్రయాణికలు ఆదివారం తమ ప్రయాణాలను రద్దుచేసుకోని సహకరించాల్సిందిగా ఓ ప్రకటనలో చెప్పారు.మధిర డిపోలో మొత్తం 65ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటిని ప్రతిరోజు మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌, వైరా, తల్లాడ, కొణిజర్ల మండలాలతో పాటు, హైదరాబాద్‌, ఖమ్మం, తిరుపతి, కృష్ణాజిల్లాలోని నందిగామ, విజయవాడ, నెమలి, గంపలగూడెం, తిరువూరు తదితర ప్రాంతాలకు నిత్యం సర్వీసులు నడుస్తుంటాయి. అయితే ఆర్టీసీ బస్సులను మొత్తం టీఆర్‌ఎస్‌ సభకు నాయకులు అద్దెకు తీసుకోవడంతో డిపోలోవున్న మొత్తం 65బస్సులను హైదరాబాద్‌ సభకే కేటాయించారు.