తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ(61) మృతిపై గవర్నర్ నరసింహన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెహిదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం, మీడియాతో నరసింహన్ మాట్లాడుతూ, హరికృష్ణ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. హరికృష్ణ మృదు స్వభావి అని చెప్పిన నరసింహన్, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.ఆయన నందమూరి కుటుంబసభ్యులను పరామర్శించారు.