చైతన్యరథంలో హరికృష్ణ అంతిమయాత్ర....!

SMTV Desk 2018-08-29 16:32:03  ntr,harikrishna,accident,nalgonda chaitanyaradam

హైదరాబాదులోని నాచారంలో ఉన్న రామకృష్ణ స్టూడియోలో చైతన్య రథంతో నందమూరి హరికృష్ణకు అత్యంత అనుబంధం. తెలుగువారి ఆత్మాభిమానం కోసం తెలుగుదేశం పార్టీని నెలకొల్పిన దివంగత ఎన్టీఆర్ నిర్వహించిన చైతన్య యాత్రలో తన 72వేల కిలోమీటర్ల ఆ యాత్రకు హరికృష్ణ సారథిగా వ్యవహరించారు.కాగా ఎన్టీఆర్ కుమారుడు అయినటువంటి హరికృష్ణ పాత్ర ఇందులో అత్యంత కీలకమైనది. ఈ యాత్ర చివరి వరకు తన తండ్రినే వెన్నంటి ఆయన ఉన్నారు. మరో పక్క ఈ చైతన్య రథమే ఎన్టీఆర్ ను అసెంబ్లీకి వరకు పంపింది ముఖ్యమంత్రిని కూడా చేసింది. నేడు నల్గొండ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హరికృష్ణ అంతిమయాత్రకు ఈ వాహనాన్నే ఉపయోగించాలని ఆయన కుటుంబసభ్యులు నిర్ణయించారు. దీంతో, హరికృష్ణ కోసం చైతన్యరథం మరోసారి సిద్ధమవుతోంది.