ఏపీ సిఎం...తెలంగాణ సిఎం గుసగుసలు....

SMTV Desk 2018-08-29 16:17:02  telangana,chandrababu,kcr.harikrishna,andhrapradesh

మెహిదీపట్నంలో ఉన్న నందమూరి హరికృష్ణ నివాసానికి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డిలు కూడా నివాళి అర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతరం కేసీఆర్ తో పాటు అదే సమయంలో అక్కడే ఉన్న చంద్రబాబు కూడా బయటకు వచ్చారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలను నిర్వహిస్తున్న విషయం గురించి చంద్రబాబుతో కేసీఆర్ కొంత మాట్లాడసాగారు అని సమాచారం. సీఎం కేసీఆర్ కు వీడ్కోలు పలికిన చంద్రబాబు ఎదావిధిగా లోపలకు వెళ్లిపోయారు.