నేడు సీఎం కెసిఆర్ ను కలిసిన భాజపా ఎమ్మేల్యేలు..

SMTV Desk 2018-08-28 16:33:56  telangana,cm,kcr,bjp,trs,haidarabad,dhelhi

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను నేడు క్యాంప్ కార్యాలయంలో పలువురు రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు కలుసుకున్నారు .మాజీ ప్రధాని దివంగత వాజ్ పేయి స్మృతి వనం హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని కేసిఆర్ ని విజ్ఞప్తి చేసేందుకు కలుసుకున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన అనంతరం ఎవ్వరికీ అపాయింట్ మెంట్ ఇవ్వని సంగతి తెలిసిందే. కాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన అనంతరం ఏ నాయకులకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ బీజేపీ నేతలను కలుసుకోవడంపై రాజకీయ వర్గాల్లో పలు ఆసక్తికరమైన చర్చ వెలువడుతున్నాయి. రాబోవు అసెంబ్లీ ఎన్నికల విషయాలపై టీఆర్ఎస్, బీజేపీలు చర్చనియంసలు జరుగుతున్నాయని పలు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.