రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తదని మంత్రి తలసాని శ్రీనవాస్యాదవ్ అన్నారు. హైదరాబాద్ పర్యటనలో రాహుల్ మాటలు, చేష్టలను అందరూ చూశారని, రాహుల్గాంధీ ఓ బచ్చా అని అర్థమైందని మంత్రి పేర్కొన్నారు మంగళవారం వరంగల్ రూరల్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు బస్సుయాత్ర పేరుతో కారుకూతలు కూస్తున్నారని, కాంగ్రెస్లో అందరూ సీఎం అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారని, సూట్కేసు దొంగలు కూడా ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి పేర్కొన్నారు కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేయడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాలవారు ఆసక్తిగా గమనిస్తున్నారని పేర్కొన్నారు