ప్రధాని మోడీతో కేసీఆర్‌

SMTV Desk 2018-08-25 19:00:42  KCR, delhi, PM Modi,

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన ముమ్మరంగా సాగుతుంది. కాగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ ప్రధాని మోడీతో ఇవాళ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాలపాటు వీరి భేటీ జరిగింది. ఈ భేటీలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, పెండింగ్‌ సమస్యలపై చర్చించినట్టు సమాచారం. ప్రత్యేక హైకోర్టు పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు, కొత్త జిల్లాల్లో జవహర్‌ నవోదయ పాఠశాలల ఏర్పాటు, ఐఐఎం, ఐటీఐఆర్‌ కేటాయింపు వంటి అంశాలను ప్రధాని వద్ద సీఎం కేసీఆర్‌ ప్రస్తావించినట్టు సమాచారం.