ఓ వైపు ముందస్తు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా మరికొన్ని వర్గాలను తమవైపు తిప్పుకునేలా కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేసీఆర్ ప్రజలపై ముందస్తు వరాల జల్లు కురిపించారు. ఆ వివరాలు: 1. ఎస్సీ ఎస్టీ గృహవినియోగదారులకు 101 యూనిట్ల వరకు కరెంటు ఉచితం. 2. ఇమామ్, మౌజమ్ ల గౌరవ వేతనం రూ.5,000 కు పెంపు. 3. అర్చకుల పదవీ విరమణ వయసు 58 నుంచి 65కు పెంపు. 4. అన్ని కులసంఘాలకు హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ఉచితంగా స్థలాలు, నిర్మాణ ఖర్చులు ఇవ్వబడతాయి. 5. మెఫ్మా రిసోర్స్ పర్సన్స్ మరియు 29 మినీ గురుకుల పాఠశాలలో సిబ్బండి జీతల పెంపు.