కొడుకు అధికారం గురించే కెసిఆర్ ఆలోచనలు : బిజెపి

SMTV Desk 2018-08-25 10:34:11  KCR, Bjp , Kanti velugu , sridhar reddy

సర్వేంద్రియానామ్ నయనం ప్రధానం. ఈ సృష్టిలో జీవించే ప్రతి ప్రాణికి దృష్టి అత్యంత ముఖ్యం. అందుకే కళ్లకు, కంటి చూపునకు ఉన్న విలువ తెలిసిన సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎవరూ కంటి సమస్యలతో బాధపడొద్దని కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐతే ఈ విషయంలో బిజెపి ఆసక్తికరమైన విమర్శ చేసింది. ఆ పార్టీ అదికార ప్రతినిది శ్రీదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా టిఆర్ఎస్ ముందస్తు ఎన్నికల గురించి , కొడుకు అధికారం గురించే కెసిఆర్ ఆలోచనలు సాగుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కంటికి ఢిల్లీ వెళ్లి వైద్యం చేసుకుంటారు కానీ ఊర్లలో ఉన్న ప్రజలు ఉస్మానియా ఆసుపత్రికి కూడా రావడానికి వీలు లేదా అని హేళన చేసారు.