జూలై: 12 : దేశ రాజధాని దిల్షాద్ గార్డెన్ లో బుధవారం ఉదయం ఓ క్యాటరింగ్ సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న బినోద్ బిష్త్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. తెల్లవారుజామున ఇంటికి వచ్చిన అతను ఇదేరీతిలో భార్యతో గొడవపడ్డాడు. బార్య రేఖ వివాహేరిత సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రోజు ఆమెతో గోవదపదేవాడు. ఆ సమయంలో పక్క గదిలో ఇద్దరు కొడుకులు నిద్రిస్తున్నారు. ఆగ్రహావేషాలకు లోననైన బినోద్ ఒక్కసారిగా బ్యార్యపై కత్తితో దాడి చేశాడు. నిద్రలోంచి మెలుకువ వచ్చిన చిన్న కొడుకు తండ్రిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దాడి చేస్తున్న తండ్రిని అడ్డుకోవడానికి ఆమె 15 ఏళ్ల కొడుకు ప్రయత్నించడంతో.. అతడిపై కూడా ఆ వ్యక్తి దాడి చేశాడు. బాలుడి చేతికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. భార్యపై దారుణంగా పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. ఆమె సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచిందని తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు అని పోలీసులు చెప్పారు.