హైదరాబాద్, మే 3 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆకాల వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, ఖాజీపేటలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈదురుగాలులుతో కూడిన వర్షంతో పలుచోట్ల రహదారులపై చెట్లు విరిగిపడిపోయాయి. వర్షబీభత్సానికి పలుచోట్ల వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. రాష్ట్రంలోని పలు పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గాలుల బీభత్సానికి మామిడి నేలరాలింది. వరంగల్ రైల్వేస్టేషన్లో గాలికి ప్లాట్ఫాం రేకులు ఎగిరిపడ్డాయి. వరంగల్, నర్సంపేట, ములుగు రహదారిపై చెట్లు విరిగి పడ్డాయి. ఎంజీఎం ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.