అధికారం మాదే : యడ్యూరప్ప

SMTV Desk 2018-04-30 15:39:04  B. S. Yeddyurappa, bjp leader, karnataka elections, congress

బెంగళూరు, ఏప్రిల్ 30 : కన్నడనాట ఎన్నికల రణంకు అన్ని పార్టీలు సై అంటే సై అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారం మాదంటే మాదని భాజపా, కాంగ్రెస్‌ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఓ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో ఎట్టిపరిస్థితుల్లోను భాజపా ప్రభుత్వమే వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 140 నుంచి 160 స్థానాలను భాజపా గెలుచుకొని అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పోటీ చేస్తోన్న చాముండేశ్వరి, బాదామి రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. మే 15 తర్వాత తానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానన్నారు.