పీవీకి భారతరత్నఇవ్వాలని మోదీకి లేఖ

SMTV Desk 2018-04-29 17:56:20  Should be Congress leader Jana reddy, given Bharat Ratna to PV Narasimha Rao

హైదరాబాద్, ఏప్రిల్ 29‌: దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్నఇవ్వాలని ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డి లేఖ రాశారు. భారతరత్న ప్రకటించి సముచితంగా గౌరవించాలని మోదీని జానారెడ్డి కోరారు. 60 దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రధానిగా, ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి విశిష్ట సేవలు అందించారని లేఖలో గుర్తు చేశారు. ప్రధానిగా పనిచేసిన సమయంలో దేశ జీడీపీని పరుగులు పెట్టించారని తెలిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారతరత్న ఇవ్వడం సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు.