జగిత్యాల అభివృద్దికి కృషి: కేటీఆర్‌

SMTV Desk 2018-04-25 18:52:30  IT, Minister KTR, Jagityal, tour

జగిత్యాల, ఏప్రిల్‌ 25 : జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం జగిత్యా ల మండలం మోతె గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎంపీ కవితతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ కవిత చొరవతోనే జగిత్యాలకు 4 వే ల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించామని అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవనర్గానికి ధీటుగా జగిత్యాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రాబోవు ఎన్నికల్లో జగిత్యాలలో గులాబీ జెండా ఎగురవే సి జగిత్యాల నుంచే జైత్రయాత్ర మొదలుపెడతామని ఆయన అన్నారు. జగిత్యాల ప్రస్తుత శాసనసభ్యులు ఎమ్మెల్యే జీవ న్‌రెడ్డి ఒక నాడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా రూ.5 కోట్ల కంటే ఎక్కువగా జగిత్యాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాలలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న కూడా పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్లు నిధులు కేటాయించి జగిత్యాల అభివృద్ధికి పాటు పడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.