న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగంతో పాటు ప్రజా గాయకుడు గద్దర్ కుమారుడు జీవీ సూర్యకిరణ్ వేములవాడకు చెందిన ఆది శ్రీనివాస్ తదితరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి రాహుల్ ఆహ్వానించారు. ప్రస్తుతం సూర్యకిరణ్ నిఫ్ట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ)లో రీసెర్చ్ అసోసియేట్ గా పని చేస్తున్నారు. రాజకీయాలపై ఉన్న ఆసక్తి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఈ సందర్భంగా సూర్యకిరణ్ వెల్లడించారు.