హైదరాబాద్, ఏప్రిల్ 24: ఈ నెల 27న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉదయం 10 గంటలకు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫలితాలను విద్యార్థులు పలు వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని ఎస్సెస్సీ బోర్డు అధికారులు తెలిపారు. విద్యార్థులు results.cgg.gov.in, bse.telangana.gov.in వెబ్సైట్లలో మాత్రమే కాకుండా ఇతర వెబ్సైట్ల ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చుని ప్రకటించింది.