రుణమాఫీ బకాయిలను వెంటనే చెల్లించాలి

SMTV Desk 2018-04-23 18:17:52  ponnala laxmaiah, former, kcr

హైదరాబాద్, ఏప్రిల్ 23: రుణమాఫీ బకాయిలను వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతుల పరస్థితి దయనీయంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యం, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంట నష్టాన్ని లెక్కించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని విమర్శించారు. రైతుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షిస్తోందని, కౌలు రైతులకు రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలన్నారు. నాలుగేళ్లలో బీమా కింద ఒక్క రైతుకూ పరిహారం అందలేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రైతులే తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు.