హైదరాబాద్, ఏప్రిల్ 13 : అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా "మహానటి" చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకాభిమానానికి చిత్ర యూనిట్ ఒక శుభవార్త తెలిపింది. ఈనెల 14న "మహానటి" టీజర్ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మధురవాణి, విజయ్ఆంటోనీల మోషన్ పోస్టర్ను విడుదల చేశారు. "చరిత్రలో భాగస్వామ్యం కావడానికి రండి" అంటూ రాసి ఉన్న మోషన్ పోస్టర్లో మధురవాణిగా సమంత, విజయ్ ఆంటోనిగా విజయ్ దేవరకొండ ఆకట్టుకుంటున్నారు. విజయ్ కెమెరా పట్టుకుని స్కూటర్పై కూర్చోగా, సైడ్ కార్లో సమంత పుస్తకం చదువుతూ ఉన్న స్టిల్ అలరిస్తోంది. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్బాబు, సమంత, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, ప్రకాశ్రాజ్, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య భూమికలు పోషిస్తున్నారు. అయితే మే 9న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.