హైదరాబాద్, ఏప్రిల్ 12 : సినీనటి శ్రీరెడ్డి.. తనకు జరిగిన అన్యాయంపై పోరాడుతూ వస్తోంది. ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇటీవలే "మా" ఫిలిం ఛా౦బర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. శ్రీరెడ్డి వ్యవహారంపై జాతీయ మానవహక్కుల కమిషన్ స్పందించింది. ఆమెకు మద్దతుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ నిలిచింది. సినిమాల్లో నటించకుండా శ్రీరెడ్డిని అడ్డుకోవడం ముమ్మాటికీ ఆమె హక్కులకు భంగం కలిగించడమేనని మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. శ్రీరెడ్డి హెచ్ఆర్సీని ఆశ్రయించకపోయినప్పటికీ ఆమె కేసును సుమోటోగానే స్వీకరించి, చివరకు నోటీసులు జారీ చేసింది.