హైదరాబాద్, ఏప్రిల్ 6 : టాలీవుడ్ సంచలనం.. నటి శ్రీరెడ్డి రోజుకో వార్త బయటకు తీసుకొస్తూ సినీ ప్రపంచం తెర వెనుక జరిగే విషయాలను వెల్లడిస్తూ వస్తోంది. ఇటీవల ప్రముఖ సింగర్, ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామచంద్ర తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడ౦టూ అందుకు సంబంధించిన ఛాటింగ్ ను స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో సంచలనానికి శ్రీరెడ్డి తెర లేపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు న్యాయం చేయాలని లేదంటే నిరాహార దీక్ష చేస్తానని, పబ్లిక్ లో న్యూడ్ గా నిలబడతానని పేర్కొంది. శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజిలో.. "కేసీఆర్ గారు మీరు మా బాధ అర్థం చేసుకోకపోతే, మీరు ఏ నిరాహార దీక్షనైతే చేసి సక్సెస్ అయ్యారో.. నేను కూడా అదే నిరాహార దీక్ష చేస్తా. మీరు అప్పటికీ పట్టించుకోకుంటే, అప్పుడు నేను నెక్ట్స్ స్టెప్ తీసుకుంటా. పబ్లిక్లో న్యూడ్గా నిలబడతా. సర్.. ప్లీజ్ విషయం తెలుసుకోండి. మిమ్మల్ని ఎలా కలవాలో నాకు తెలియట్లేదు సార్" అంటూ పోస్ట్ చేసింది.