ముంబై, మార్చి 26 : మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్.. ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఆమెను పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారట. ఈ విషయంపై స్పందించిన సుస్మితా.. ఈ విధంగా స్పందించింది. “నేను ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకున్నాను. వారి ఆలనా పాలన చూసుకుంటున్నాను. అలా చూసుకోవడానికి కేవలం రక్త సంబంధమే కానవసరం లేదు. ఒక కుటుంబం ఏర్పడాలంటే ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకుని వారి ఇంటి పేరును జత చేసుకుంటేనే కుటుంబం అవ్వదు కదా” అంటూ చెప్పుకొచ్చింది. నిజంగా ఇలాంటి అభిప్రాయాలు మారాలి. చాలా మంది ఈ మధ్య కాలంలో పిల్లల్ని దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో ఆస్వాదిస్తేనే తెలుస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం సుస్మితా సినిమాలకు దూరమై ఒక టీవీ రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.