హైదరాబాద్, మార్చి 18 : విభిన్న కథాంశం గల చిత్రాలతో ప్రేక్షకులను అలరించే శర్వానంద్ కు దర్శకుడు సుధీర్ వర్మ చెప్పిన కథ తన అభిరుచికి తగినట్లు అనిపించడంతో ఆ సినిమాకి ఓకే చెప్పారట. సితార ఎంటర్టైన్మెంట్ వారి నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రాన్ని 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా కోసం ఏకంగా కోటి రూపాయల ఖర్చుతో ఒక భారీ సెట్ ను వేయించారనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలావరకు షూటింగ్ ఈ సెట్లోనే జరుగుతుందని సమాచారం. శర్వానంద్ సినిమాకి కోటి రూపాయల ఖర్చుతో సెట్ వేయడం ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది.