కాసేపట్లో స్వదేశానికి శ్రీదేవి పార్థివదేహం..

SMTV Desk 2018-02-26 11:13:58  sridevi dead body, mumbai, reliance private jet.

ముంబై, ఫిబ్రవరి 26 : అతిలోక సుందరి శ్రీదేవి పార్థివదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్న సమయంలో రిలయన్స్‌కు చెందిన 13 సీట్ల ప్రైవేటు జెట్‌ విమాన౦ దుబాయ్‌కి చేరుకుంది. కాని అధికార లాంఛనాలు పూర్తికాకపోవడంతో ఆ విమానం వెంటనే తిరుగు ప్రయాణం కాలేకపోయింది. ప్రైవేటు జెట్ విమానం(ఎంబ్రేయర్-135బీజే) లో శ్రీదేవి పార్థివదేహంతో పాటు కుటుంబ సభ్యులు, సమీప బంధువులు వస్తారు. కాగా నేడు శ్రీదేవి మృతదేహం దుబాయ్ నుండి ముంబైకి చేరుకోనున్న నేపథ్యంలో అంధేరిలోని నివాసానికి అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. భారీగా జనాలు గుమిగూడటంతో పోలీసులు అక్కడకు చేరుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించిన అనంతరం జుహూలోని శాంతక్రజ్ శ్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.