హైదరాబాద్, జనవరి 18 : తెలుగు సినీ పరిశ్రమపై ఐటీ శాఖ దృష్టి సారించింది. సినిమాల ద్వారా వచ్చిన రాబడికి తగిన విధంగా పన్నులు చెల్లిస్తున్నారా.? లేక ఎగవేస్తున్నారా? అనే దిశగా పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు "అజ్ఞాతవాసి" చిత్ర నిర్మాత ఎస్ రాధాకృష్ణ (చిన్నబాబు)కు చెందిన హారికాహాసిని క్రియేషన్స్ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అంతకు ముందు భవ్య క్రియేషన్స్, సురేశ్ ప్రొడక్షన్స్, డీవీవీ క్రియేషన్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలపైనా అనిశా దాడులు జరిపినట్లు తెలుస్తోంది. సినిమాకు వచ్చిన కలెక్షన్లను, వాటికి సంబ౦ధి౦చిన లెక్కలను సరిగా చూపుతున్నారా.! అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, అంతేగాని ఈ దాడులకు ఎలాంటి ప్రత్యేకత లేదని అధికారులు స్పష్టం చేశారు.