ముంబాయి, జనవరి 6: ఇప్పుడు ప్రతి ఒక్కరి నోటా బాలీవుడ్ బ్యూటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇల్లు గురించే. ఎందుకు అందరూ ఇంతగా మాట్లాడుకుంటున్నారంటే ఐశ్వర్యరాయ్ కొత్త ఇల్లును కొనుగోలు చేసింది. ఆ భవంతి ఇంద్ర భవనాన్ని ఏమాత్రం మించిపోకుండా ఉండడం అందరినీ ఆకట్టుకుంటుంది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్లో ఉన్న ఈ ఇంటికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 2015లో ఐశ్వర్య దంపతులు ఈ అపార్ట్మెంట్ను కొని తలతి పంతకి అసోసియేషన్స్తో డిజైన్ చెప్పించినట్లు సమాచారం. అది కూడా రూ.21 కోట్లతో ఈ ఇంటిని కొన్నట్టు బాలీవుడ్ వర్గాల్లో టాక్. కొత్త హంగులతో తీర్చిదిద్దిన ఈ విలాసవంతమైన భవనాన్ని మీరు చూడండి.