కరాచీ, జనవరి 5: ప్రేమ-పరువు రెండు ఒక చోట నిలువవనే విషయం అందరికి తెలిసిందే. అలాంటి పరువు కోసం కాబోయే వధు వరులను దారుణంగా చంపాడు. సింధ్ ప్రావిన్స్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నయీ వహీ గ్రామానికి చెందిన నజ్రీమ్ అనే యువతికి తన బంధువైన షాహిద్ అనే వ్యక్తితో వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించారు. అయితే వీరిద్దరూ ఒకరోజు ఇంట్లో పెద్దలకు తెలియకుండా ఊరి చివరకు వెళ్లి మాట్లాడుకున్నారు. ఇది చూసిన నజ్రీమ్ మేనమామ ఆగ్రహానికి గురై తన వద్ద ఉన్న తుపాకీ తీసి ఇద్దరిని కాల్చి చంపాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, నజ్రీమ్ మేనమామను అరెస్టు చేశారు.