బ్యాటింగ్ చేసిన బాలయ్య..

SMTV Desk 2017-12-30 15:44:49  balakrishna, cricket tournment, hindhupuram

హిందూపురం, డిసెంబర్ 30: స్థానిక ఎంజీఎం క్రీడా మైదానంలో బసవతారకరామ మెమోరియల్‌ క్రికెట్‌ టోర్నీని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. రెండో రోజు పర్యటన సందర్భంగా క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఆయన, క్రీడాకారులను ఉత్సాహపరిచి, వారితో కాసేపు క్రికెట్ ఆడారు. మానసిక ఒత్తిడి నుండి కాపాడుకోవడానికి క్రీడలు ఎంతగానో తోడ్పడుతాయని ఆయన అన్నారు.