కాబూల్, డిసెంబర్ 28 : అఫ్గానిస్థాన్లోని కల్చరల్ సెంటర్ లో వరుస పేలుళ్లు సంభవించాయి. తబయాన్ కల్చరల్ సెంటర్ వద్ద కార్యక్రమాలు జరుగుతుండగా ఓ ఉగ్రవాది అక్కడకు ప్రవేశించి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఆత్మాహుతి దాడులు చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఐఎస్ ప్రకటించింది. షియా వర్గాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఈ ఘటనతో ఒక్కసారిగా కాబూల్ ఉలిక్కిపడింది. స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మొత్తం 41 మంది వరకు ప్రాణాలను కోల్పోగా, 80 మందికి పైగా గాయపడ్డారు. వరుసగా మూడు సార్లు ఇస్లామిక్ స్టేట్ ఈ దాడులకు పాల్పడినట్లు పేర్కొంది.