ఇస్లామాబాద్, డిసెంబర్ 25 : ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద పాకిస్థాన్ గృహ నిర్బంధం చేసిన ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జేయూడీ చీఫ్హఫీజ్ సయీద్, లాహోర్ లో ఎంఎంఎల్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జనవరి 31న హఫీజ్ను గృహ నిర్బంధం చేసిన పాక్ అధికారులు నవంబర్ 24న విడుదల చేశారు. గృహ నిర్భందం నుండి విడుదలైన ఆయన 2018 సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో హఫీజ్ చేసిన నేరాలను పరిగణలోకి తీసుకుని మళ్లీ అరెస్ట్ చేయాలని పాక్కు అమెరికా తెలిపింది. పాకిస్థాన్ కూడా హఫీజ్ పార్టీ పెట్టడానికి నిరాకరించినా లాహోర్ లో పార్టీ ప్రధాన కార్యాలయాన్ని స్థాపించారు. ఎంఎంఎల్ని రాజకీయ పార్టీగా పరిగణలోకి తీసుకుంటే రాజకీయాల్లోనూ ఉగ్రవాదం, అహింస ఎక్కువవుతుందని పలు దేశాలు హెచ్చరిస్తున్నాయి.