హైదరాబాద్, డిసెంబర్ 23 : నూతన ఏడాదిలో బీజీ బీజీ షెడ్యూల్ లో అల్లరి నరేష్ వరుస చిత్రాలతో సందడి చేయబోతున్నారు. ఈ ఏడాదిలో మెడమీద అబ్బాయి చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోలేకపోయిన, ఆయన 2018 కోసం పెద్దయెత్తున ప్రణాళికలు రచించినట్టు సమాచారం. కాగా, ఇప్పటికే నరేష్ మూడు కథలకి సంతకం చేసినట్లు తెలిసింది. ‘సుడిగాడు’తో పతాక స్థాయిలో నవ్వులు పండించిన అల్లరి నరేష్ - భీమనేని శ్రీనివాసరావు ల కాంబినేషన్ తో వచ్చే కొత్త ఏడాదిలో ఓ చిత్రం రాబోతోంది. ఆ తర్వాత ఇ.సత్తిబాబు దర్శకత్వంలోనూ నరేష్ ఓ చిత్రం చేయబోతున్నారు. దాంతోపాటు ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టు తెలిసింది. మహేష్బాబు - వంశీ పైడిపల్లి కలయికలో తెరకెక్కబోతున్న సినిమాలోని ఆయన ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.