ముంబయి, డిసెంబర్ 22 : దేశరాజధానిలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ దంపతుల వివాహ విందు నిన్న అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో అనుష్క ఎరుపు రంగు చీరలో ఆభరణాలతో ధగధగా మెరిసిపోయారు. అన్నింటికంటే అనుష్క ధరించిన చోకర్ నెక్లెస్ అందరినీ ఆకట్టుకుంది. దీని ఖరీదు రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందట. వీరి పెళ్ళి నుంచి మిగితా వాటన్నింటికి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన దుస్తులే వేసుకున్నరట. అయితే, నిన్న జరిగిన విందులో అనుష్క ధరించిన ఎరుపు రంగు బెనారసీ చీర అని.. బెంగాళీ మహిళలు పెళ్లిళ్ల సమయంలో ఎక్కువగా వీటిని ధరిస్తారని సబ్యసాచి వెల్లడించారు. కాగా, ఈ నూతన దంపతులు మరో మారు ముంబయిలో ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత వీరిద్దరూ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి, నూతన సంవత్సర వేడుకలను అక్కడే జరుపుకోనున్నారు. అనంతరం, జనవరి నుంచి అనుష్క ‘పరి’, ‘సూయీ ధాగా’ చిత్రాల్లో అనుష్క బీజీ బీజీగా ఉండబోతున్నారు.