ఇస్లామాబాద్, డిసెంబర్ 21: పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానమైన ఘట్టం. ఓ మరుపురాని మదుర జ్ఞాపకం. అలాంటి పెళ్ళిలో అతిథులకు పెళ్ళికొడుకు బంధువులు విలువైన బహుమతులు అందించారు. ఆ వివాహం ఎలాగైనా అందరికీ గుర్తుండాలని వారిపై డాలర్లు, సెల్ఫోన్ల వర్షం కురిపించాడు. దీనికి సంబందించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే... పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అర్షాద్కుఖాన్పూర్లోని మహిళతో ఇటీవలే వివాహం జరిగింది. పెళ్లి రోజు వరుడి కుటుంబసభ్యులు బస్సులో వధువు ఇంటికి వస్తూవస్తూనే, కొందరు బస్సుపై నిల్చుని పెళ్లికి వచ్చిన అతిథులపై డాలర్లు, సౌదీ అరేబియా కరెన్సీ రియాల్స్, సెల్ఫోన్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత వారు ఇంటి ముందు ఏర్పాటుచేసిన స్టేజీ ఎక్కి డాలర్లను గాల్లోకి విసిరేశారు. అవి తీసుకునేందుకు అక్కడికి వచ్చిన వారంతా ఎగబడ్డారు.