పాక్ జైళ్ళల్లో 527 మంది భారతీయులు...

SMTV Desk 2017-12-20 14:14:56  pakistan jail, indian Prisoners, lahor

లాహోర్, డిసెంబర్ 20: పాకిస్థాన్‌ జైళ్లలో దాదాపు 500 మందికి పైగా భారతీయ ఖైదీలు ఉన్నారనే విషయం ,ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలిసింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం 996 మంది విదేశీయులు పాక్‌ జైళ్లలో మగ్గుతుండగా వారిలో 527 మంది భారతీయులు ఉన్నారు. ఉగ్రవాదం, హత్య, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమంగా ఆ దేశంలోకి చొరబడటం వంటి నేరాలు చేసిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. పాక్‌ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపల వేట చేస్తున్న జాలర్లను ఎక్కువగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.