కరాచీ, డిసెంబర్ 18: ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ అసలైన దేశ భక్తుడని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. పాక్ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముషారఫ్ మాట్లాడుతూ... ఎల్ఈటీ, జేయూడీ నిజమైన దేశభక్తులని, కశ్మీర్ కోసం వాళ్లు ప్రాణాలను త్యాగం చేస్తున్నారని కొనియాడారు. రాజకీయాల్లోకి వచ్చిన హఫీజ్తో పొత్తు కుదుర్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతేకాదు హఫీజ్ మంచివారని, తను రాజకీయ పార్టీని ప్రారంభిస్తే అడ్డు చెప్పే వాళ్లే లేరని అన్నాడు.