హైదరాబాద్, డిసెంబర్ 16: టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ అందరికీ సుపరిచితుడే. ఆకాష్ చిన్న వయస్సు నుండే ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆకాష్ ను హీరో గా పూరి జగన్నాథ్ ‘మెహబూబా’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆకాష్ సరసన కన్నడ హీరోయిన్ నేహ శెట్టి నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రను షేక్ జునైద్ పోషిస్తున్నారు. జునైద్ ఇప్పటికే ‘టెంపర్’ ‘దూకుడు’ ‘దడ’ సినిమాలలో చిన్న చిన్న నెగిటివ్ రోల్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో తాను చేస్తున్న పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉంటుందనీ, తనకి మంచి పేరు తీసుకొస్తుందని జునైద్ అన్నారు. ఈ సినిమా తనకి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.