హైదరాబాద్, డిసెంబర్ 03 : బాలీవుడ్ హాట్ బాంబ్, అందాల తార సన్నీలియోనీ తొలిసారి నాలుగు భాషల్లో నిర్మిస్తున్న చిత్రంలో ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో తెరకెక్కనుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ చరిత్రాత్మక చిత్రంలో ఆమె నటించబోతున్నారు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు వడి వుడయన్ దర్శకత్వం వహించగా, స్టీఫెన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఇంతక ముందు సన్నీలియోనీ మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ సినిమాలో టీచర్ పాత్రలో నటించింది. తాజాగా రాజశేఖర్ ‘గరుడవేగ’ చిత్రంలో ‘డియో డియో..’ అనే పాటతో కుర్రకారుని ఉర్రూతలూగించింది.