నార్త్ కరోలినా, డిసెంబర్ 03 : గతవారం నుంచి కనిపించకుండా పోయిన మూడేళ్ల చిన్నారి శవమై చిన్న వాగులో కనిపించిన ఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...జాక్సన్విల్లేకు చెందిన క్రిస్టీ వూడ్స్ కుమార్తె మరియా కే వూడ్స్ గత సోమవారం నుంచి అదృశ్యమైంది. ఆదివారం రాత్రి మరియాను తన గదిలో పడుకోబెట్టాగా, ఉదయం లేచి చూసేసరికి చిన్నారి కన్పించలేదని తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ప్రత్యేక బృందాలు, వాలంటీర్లు విస్తృతంగా గాలించారు. అయితే, పాప అదృశ్యం కేసులో తల్లి క్రిస్టీ బాయ్ఫ్రెండ్ను కిమ్రేను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇదంతా చూస్తుంటే భారత సంతతికి చెందిన మూడేళ్ల చిన్నారి షెరిన్ హత్యోదంతాన్ని గుర్తు చేస్తుంది. షెరిన్ను డల్లాస్కు చెందిన వెస్లీ మాథ్యూస్ దంపతులు దత్తత తీసుకున్నారు. ఇటీవల ఆమెకు బలవంతంగా పాలు తాగించేసరికి ఊపిరాడక షెరిన్ చనిపోయింది. ఈ విషయాన్ని దాచిన తండ్రి వెస్లీ, ఆమె కనబడకుండా పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు విషయం బయట పడటంతో పెంపుడు తండ్రిని అరెస్టు చేశారు. ఈ తరహాలోనే కుమార్తె మరియా కే వూడ్స్ హతమై, ఉండొచ్చనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ, పూర్తి విచారణలో నిమగ్నమయ్యారు.