హైదరాబాద్, డిసెంబర్ 02 : ప్రస్తుత సినీరంగంలో హీరోలు, దర్శకులుగా, నిర్మాతలుగా, మారుతున్నారు. అదే కోవలోకి టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని చేరిపోయారు. ఆయన నిర్మాతగా తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ‘అ!’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. కొన్నిరోజుల ముందే సినిమా టైటిల్ను విడుదల చేసిన చిత్ర యూనిట్, తాజాగా నిత్యమీనన్ ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఇందులో ఆమె స్వతంత్య్ర భావాలు కలిగిన అమ్మాయి పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, కాజల్, నిత్యామేనన్, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి పులికొండ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఒక వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్నట్లు నాని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం తెలిపింది.