హైదరాబాద్, నవంబర్ 27 : సినిమాలో నటీనటులు డబ్బింగ్ చెప్పడం ఇటీవల మామూలైపోయింది. ఇప్పటికే హీరోయిన్స్ చాలా మంది సినిమాల్లో తమ గాత్రాన్ని వినిపించారు. అందులో నిత్యామీనన్, అనుపమ పరమేశ్వరన్ సరసన మలయాళీ భామ కీర్తి సురేశ్ చేరిపోయింది. తెలుగులో తానూ నటిస్తున్న "అజ్ఞాతవాసి" సినిమాకు కీర్తి డబ్బింగ్ చెప్పడం పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి సురేష్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె "తెలుగులో మొదటిసారి డబ్బింగ్ చెప్పాను. ఇప్పుడు నాకు సంపూర్ణంగా అనిపిస్తోంది" అని ట్వీట్ చేసింది. అలాగే డబ్బింగ్ థియేటర్లో దిగిన ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది.