ఐష్‌ ఏడ్చేసింది...

SMTV Desk 2017-11-21 11:59:14  Aishwarya rayi, smile foundation, mumbai

ముంబాయి, నవంబర్ 21: మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌ తండ్రి కృష్ణారాజ్‌ రాయ్‌ కొన్ని నెలల క్రితమే అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన జయంతి సందర్బంగా, ఆమె తన తండ్రి కోసం ముంబయికి చెందిన స్మైల్‌ ఫౌండేషన్‌ ద్వారా గ్రహణం మొర్రి సమస్యతో బాధపడుతున్న 100 మంది చిన్నారులకు సర్జరీ చేయించారు. ఆ తర్వాత పిల్లలతో కలిసి ఐష్‌ కాసేపు సరదాగా గడిపారు. వారి ఆధ్వర్యంలోనే తన తండ్రి జయంతి సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. అయితే ఐష్‌ వచ్చారని తెలిసి మీడియా వర్గాలు ఆమె ఫొటోల కోసం గుమిగూడారు. " ప్లీజ్‌ నా ఫొటోలు తీయకండి. నేను ఏ పని కోసం ఇక్కడికి వచ్చానో మీకు తెలీదు. ఇది సినిమా ప్రీమియర్‌ షో కాదు. పబ్లిక్‌ ఈవెంట్‌ అంతకన్నా కాదు. అసలు మీరేందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు" అంటూ మీడియా ముందు ఉద్వేగానికి లోనయ్యారు.