బాలీవుడ్ భామ బారీ పారితోషకం అడిగిందట...

SMTV Desk 2017-11-19 18:04:31  Indraganti mohan krishna, sudheer babu

హైదరాబాద్, నవంబర్ 19: సుధీర్ బాబు కథానాయకుడిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కథానాయిక కోసం బాలీవుడ్ చిత్రాలలో నటించే అదితీరావును సంప్రదించారట. కానీ ఆమె 50 లక్షల పారితోషకం అడగటంతో అంత ఇచ్చుకోలేమన్న దర్శకుడు, మరో హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారని సినీ వర్గాలలో టాక్. ఈ చిత్రంలో నటించే అవకాశం ఏ ముద్దుగుమ్మను వరిస్తుందో చూడాలి మరి.