చిరంజీవి సీఎం అయితే కాపులకు కడుపు నిండదు: ఏబీఎన్ రాధాకృష్ణ

SMTV Desk 2017-11-19 15:25:09  nandi award, abn radhakrishna, banni vasu,

హైదరాబాద్, నవంబర్ 19: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై బన్ని వాసు విమర్శించిన వ్యాఖ్యలపై ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ స్పందించారు. ఏబీఎన్ నిర్వహించిన ఓపెన్ డిబేట్ లో నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలకు, రాధాకృష్ణ ... " ఇలాంటి వ్యాఖ్యల ద్వారా చిరంజీవికే ఎక్కువ నష్టం. మా చిరంజీవి అని మాట్లాడటం సరికాదు. చిరంజీవి అందరివాడు. కులం పేరిట ఎవరి కడుపు నిండదు. చంద్రబాబు సీఎం అయితే కమ్మలకు.. చిరంజీవి సీఎం అయితే కాపులకు కడుపు నిండదని " అన్నారు.