ఆ సినిమాను విడుదల చేయకండి ప్లీజ్.. : రాజస్థాన్ ముఖ్యమంత్రి

SMTV Desk 2017-11-19 12:04:44  padmavathi, rajasthan cm, vasundara raje, sanjay leela bhansali,

ముంబాయి, నవంబర్ 19: ఆ సినిమాను విడుదల చేయకండి ప్లీజ్... అంటున్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా.. అదేనండి రోజు రోజుకి వివాద భరితమైన పద్మావతి చిత్రం. ఈ చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చే ముందు సెన్సార్ బోర్డు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని, సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాత పెట్టుకున్న దరఖాస్తు అసంపూర్తి గా ఉందంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, కేంద్ర సమాచార ప్రసారశాఖా మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు. సినిమాలో అవసరమైన మార్పులు చేర్పులు చేసేంత వరకు విడుదల కాకుండా అడ్డుకోవాలని అందులో కోరారు. చరిత్రకారులు, సినీ నిపుణులు, రాజ్‌పుత్ కమ్యూనిటీ సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేసి వారు సినిమా చూసిన తర్వాత అవసరమైన మార్పులు చేర్పులు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని రాణి పద్మావతి పాత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ రాజ్‌పుత్ కర్ణిసేన తొలి నుంచి ఆందోళన చేస్తోంది. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.