నాగార్జున సోదరి నాగ సుశీల పంజాగుట్ట పీఎస్ లో...

SMTV Desk 2017-11-18 16:07:54  nagarjuna, naga susheela,

హైదరాబాద్, నవంబర్ 18: తమ భూములను విక్రయిచా౦డటు నటుడు నాగార్జున సోదరి నాగ సుశీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి తమ భూములను అనుమతి లేకుండానే విక్రయించాడని, నగదును దుర్వినియోగం చేశారని, పంజాగుట్ట పీఎస్ లో ఆమె ఫిర్యాదు చేశారు. తమ సంతకాలను ఫోర్జరీ చేసి ఈ మోసానికి పాల్పడ్డారని చెప్పారు. శ్రీనివాస్ ను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని శ్రీనివాస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.