వాషింగ్టన్, నవంబర్ 16 : గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ (జీఈఎస్)కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవంకా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆమె భారత్ పర్యటనను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. "భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ప్రపంచంలోని అత్యుత్తమ వాణిజ్య వేత్తలను కలుసుకునేందుకు ఇండియా వెళుతున్నాను. ఈ పర్యటన నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది" అని వ్యాఖ్యానించారు. ఇవాంకా ట్వీట్ పై స్పందించిన మోదీ "మీ రాకతో ఇరు దేశాల మధ్య ఆర్ధిక బంధం బలపడుతోంది. భారత్ లో నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న ప్రజలకు అమెరికాలో మంచి అవకాశాలు లభిస్తాయి. యువ వాణిజ్య వేత్తలకు మంచి జరుగుతుంది. మీ రాకకై ఎదురుచూస్తున్నాం" అని రీట్వీట్ చేస్తూ.. ఇవంకాకు స్వాగతం పలికారు.