హైదరాబాద్, నవంబర్ 14: బాహుబలి చిత్రంలో "ఇది నా మాట.. నా మాటే శాసనం" అంటూ శివగామి పాత్రకు ప్రాణం పోసి, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది నటి రమ్యకృష్ణ. అయితే ఇప్పుడు ఈ పాత్ర సినిమా వరకే పరిమితం కాకుండా త్వరలో వెబ్ సిరీస్ను నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ ను రూ. 10 కోట్ల బడ్జెట్తో వచ్చే ఏడాది నుండి ప్రారంభం చేస్తారని సమాచారం. ప్రస్థానం, వెన్నెల, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దేవా కట్టా ఈ వెబ్ సిరీస్ను రూపొందిస్తున్నారని సినీ వర్గాలలో టాక్. మరీ ఈ వెబ్ సిరీస్లో శివగామి పాత్రలో రమ్యకృష్ణ అలరిస్తుందా..? లేదా మరో నటి పోషిస్తుందా.. అనేది తెలియాల్సి వుంది.