ఇరాక్ లో మారణ హోమం...

SMTV Desk 2017-09-15 11:23:13  theeqer province in irak, irak, syria,

ఇరాక్, సెప్టెంబర్ 15: ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఇరాక్ లోని థీఖర్ ప్రావిన్స్ నస్సీరియా ప్రాంతంలో రెండు రెస్టారెంట్లలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం పోలీస్ చెక్ పాయింట్ పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 74 మంది కి పైగా మృతి చెందగా, 150 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇరాక్, సిరియాలో షాహిద్ అల్షబీ గ్రూప్, ఐసిస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూ భద్రత దళాలతో కలిసి ఉగ్రవాదులను తుదముట్టించింది. షాహిద్ అల్షబీ గ్రూప్ కు వ్యతిరేకంగా దాడికి పాల్పడ్డామని టెర్రరిస్టులు ప్రకటించారు.