చెన్నై, సెప్టెంబర్ 12 : ప్రముఖ సినీ నటి డిస్కో శాంతి, మేనకోడలు అపర్ణ (17) అదృశ్యంపై ఆందోళన చెలరేగుతోంది. గత వారం అపర్ణ అదృశ్యంకాగా, తల్లి సెరిల్,మరొక మేనత్త లలిత కుమారి మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాన్ని వివరించారు. చెన్నైలోని టీనగర్ లో లలిత కుమారి, డిస్కోశాంతిల సోదరుడు, సహాయ దర్శకుడైన అరుణ్ మొలివర్మన్ అక్కడే నివాసం ఉండగా, అపర్ణ ప్లస్ టూ చదువుతోంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వివిధ ప్రాంతాల్లో తిరిగినా ఆమె ఆచూకీ లభించక పోవడంతో, వారు పాండీ బజార్ పోలీసులను ఆశ్రయించగా, అపర్ణ చదువుతున్న చర్చ్ పార్క్ స్కూల్ లో విచారించామని చెప్పారు. అలాగే ఆ పరిసరాల్లోని 56 సీసీ టీవీల పుటేజ్ ను పరిశీలించామని అయితే, కొన్ని చోట్ల సీసీ టీవీ కెమెరాలు పనిచేయకపోవడంతో అపర్ణ అదృశ్యానికి సంబంధించిన ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు.